Wednesday, May 8, 2024

ఆటో ఢీకొని విద్యార్థి మృతి

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న మణిదీప్ కుమార్ రెడ్డి అనే విద్యార్థి బుధవారం ఉదయం సుమారు తొమ్మిది గంటలకు ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పొన్నూరుకు చెందిన మణిదీప్ ఉదయం పొన్నూరు నుండి ద్విచక్ర వాహనంపై యూనివర్సిటీకి వస్తుండగా క్వారీ గుడి స్వమీపంలోని సంగం డెయిరీ పశుదాణా కర్మాగారం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement