Wednesday, April 24, 2024

పేదల జీవితాల్లో కంటి వెలుగు : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పరిశీలించి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఆనంతరం మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాలు ఇస్తారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement