Wednesday, May 22, 2024

పెదకాకాని మల్లేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

పెదకాకాని, ఫిబ్రవరి 18 (ప్రభ న్యూస్) మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పెదకాకాని మల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని త్రయోదశి, శివరాత్రి రెండు కలిసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడం జరిగింది. అన్నపూర్ణాదేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లింగోద్భవ కాలమున ఏకాదశి ద్రవ్యములతో మల్లేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి దంపతులు, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, హైకోర్టు న్యాయమూర్తి సుజాత, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పలువురు ప్రముఖులు మల్లేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాహు కేతు పూజలు, ప్రసాద విక్రయాలు, అన్న ప్రసాద విరాళములు ద్వారా 9,13,508 ఆదాయం వచ్చినట్లు ఏసీ పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి, పెదకాకాని సిఐ బండారు సురేష్ బాబు, ఎస్సైలు గీతాంజలి, రాంబాబు, కోటేశ్వరరావు, ఇతర పోలీస్, దేవస్థానం సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement