Wednesday, May 1, 2024

ఎయిర్‌పోర్టు మెట్రోలో ఇంజనీరింగ్‌ అద్భుతాలు.. 21 మీటర్ల ఎత్తులో మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్ద ప్రత్యేక నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలుకు ఇంజనీరింగ్‌ అడ్డంకులు ఎదురవుతున్నాయి. శనివారం ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ మ్యాప్‌ను మెట్రో ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించారు. ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ అడ్వైజర్‌, రైల్వే బోర్డు మాజీ మెంబర్‌ ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి నిపుణులకు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. మెట్రోలైన్‌ వెళ్లే రాయదుర్గం స్టేషన్‌ నుంచి నానక్‌రామ్‌ గూడ జంక్షన్‌ వరకు ఉన్న భాగం ఇంజనీరింగ్‌ పరంగా అతి క్లిష్టమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ సాంకేతిక సవాళ్లను ఎదుర్కోకతప్పదని ఈ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మెట్రో లైన్‌ వెళ్లే రాయదుర్గం స్టేషన్‌ నుంచి నానక్‌రామ్‌ గూడ జంక్షన్‌ వరకు ఉన్న భాగం ఇంజనీరింగ్‌ పరంగా అతి క్లిష్టమైందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

ఇక్కడ సాంకేతిక సవాళ్లను ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. అందుకు ఉత్తమమైన ఇంజనీరింగ్‌ పరిష్కారాలను సూచించేందుకు తనిఖీలు నిర్వహించామన్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిందని 21 మీటర్ల ఎత్తులో మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ను దాటడం ఒక పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కింద నుంచి అండర్‌పాస్‌ వే మధ్యలో రోటరీ ఆ పైన ఫ్లై ఓవర్‌ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అడ్డంకిని దాటేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్‌ని అక్కడే నిర్మించేలా పరిశీలించాలని వెల్లడించారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలన్నారు. ఈ మెట్రో లైన్‌ వెళ్లే ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్‌లను ఫ్లైఓవర్‌ పిల్లలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని మెట్రో ఎండీ తెలిపారు.

బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధులు…

- Advertisement -

నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌ 3కు కొనసాగింపుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రోను విస్తరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అయితే మెట్రోను శంషాబాద్‌ విమానాశ్రయంతో కనెక్టివిటీ చేయనున్నారు. మొత్తం రూ.6250 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గత ఏడాది డిసెంబర్‌ 9వ తేదీన సీఎం కేసీఆర్‌ ఈ మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ.500 కోట్ల మేర కేటాయింపులు జరిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement