Tuesday, May 14, 2024

Tamil Nadu | క్వారీలో భారీ పేలుడు.. న‌లుగురు మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని కరియాపట్టి ప్రాంతంలోని క్వారీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, దాదాపు 10 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గదిలో పేలుడు సంభవించినట్లు నిర్ధారించారు.

క్వారీ అవియార్-కీజెప్పిలి కుందూ రహదారికి సమీపంలో ఉంది. అక్కడ క్వారీలో ఉన్నటువంటి రాళ్లను పగలకొట్టడానికి పేలుడు పదార్థాలను ఒక గదిలో నిల్వచేసి పెట్టారు. ప్రమాదవశాత్తు పేలుడు జరగడంతో క్వారీకి దగ్గరగా ఉన్నటువంటి రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే పేలుడు ప్రకంపనల ప్రభావం 20 కిలోమీటర్ల వరకు కనిపించింది. పేలుడు ధాటికి అంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు పదార్థాలు ఉండడంతో అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకోలేకపోయింది. రెస్క్యూ టీమ్ లు మెల్లగా శిధిలాలను తొలగించి, పేలని వాటి కోసం వెతుకుతున్నారు. అక్క‌డ ఇంకా చిక్కుకుపోయిన వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement