Monday, May 27, 2024

భార్య భర్తల మధ్య వివాదంలో మూడో మహిళ కు గాయాలు.

తెనాలి, (ప్రభ న్యూస్):భార్య భర్తల మధ్య వివాదం నేపథ్యంలో మూడో మహిళ కు గాయాలైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ ఎస్ఐ వి కలగయ్య తెలిపారు. ఎస్సై కథనం మేరకు పట్టణ మారిస్ పేట, చింతల మాలపల్లి కి చెందిన చింతా మల్లికార్జునరావు అతని భార్య శనివారం ఘర్షణ పడుతుండగా ఇంటి పక్కనే ఉన్న కుక్క అరిచింది అనే ఆగ్రహంతో శివ శంకర్ ను అడిగేందుకు వెళ్లడంతో మాట మాట పెరిగి శివ శంకర్ పై కర్రతో దాడికి ప్రయత్నించగా కుమార్తె అడ్డురావడంతో తలకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కలగయ్య తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement