Saturday, May 4, 2024

ఆర్ధిక మోసాల‌పై చ‌ర్య‌లు…

నకిలీ ప్రకటనలకు వెూసపోయి డిపాజిట్లు చేయొద్దు
బోగస్‌ చిట్‌ఫండ్‌ వెూసాలకు గురికావొద్దు
ఆర్బీఐ కో ఆర్డినేషన్‌ కమిటీ భేటీలో సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌

అమరావతి, : డిజిటల్‌ లెండింగ్‌, ఆన్‌లైన్‌ రుణాలు మంజూరు యాప్‌ల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్‌ దాస్‌ ప్రజలకు విజ్ణప్తి చేశారు. శుక్రవారం రిజర్వు బ్యాంకు అఫ్‌ ఇండియా రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ- సమావేశం సచివాలయం లో సిీఎస్‌ అధ్యక్షతన జరిగింది. .ఈ సందర్భంగా సిీఎస్‌ ఆదిత్యానాధ్‌ దాస్‌ మాట్లాడుతూ, ఇటీ-వల కాలంలో డిజిటల్‌ లెండింగ్‌ ఏజెన్సీలు ఎక్కవై ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆన్‌లైన్లో రుణాలు మంజూరు చేస్తా మని ప్రజలను మోసం చేయడం జరుగుతోందని అలాంటి మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు.ఎక్కడైనా ఏదైనా కంపెనీ లేదా సంస్థ యాప్‌ ద్వారా అలాంటి మోస పూరిత చర్యలతో మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. అలాంటి మోసాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరిపి కేసులు నమోదు చేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధితి ఏజెన్సీ లను సిఎస్‌ ఆదేశించారు.
బోగస్‌ సంస్థలపై ప్రజల్లో అవగాహన
బోగస్‌ చిట్‌ఫండ్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు విస్తృత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించా లని సీఎస్‌ ఆదేశించారు. ఆర్బిఐతో పాటు- పోలీస్‌, రిజిష్ట్రార్ర్‌ ఆఫ్‌ చిట్స్‌,సంబంధిత శాఖల అధికారులను సిఎస్‌ ఆదిత్యా నాధ్‌ ఆదేశించారు. వివిధ ఫైనాన్స్‌ కంపెనీలు,చిట్‌ ఫండ్‌ కంపనీల వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేసేందుకు వీలుగా హోం,న్యాయ,సిఐడి తదితర విభాగాలు నిరంతరం సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్‌ దాస్‌ ఆదేశించారు. ఇప్పటికే వివిధ ఫైనాన్స్‌ కంపెనీ లు,చిట్‌ ఫండ్‌ కంపెనీలపై నమోదైన కేసులను సత్వరం పరిష్కరించి బాధితులకు సకాలం లో న్యాయం జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవా ల్సి ఉందని ఆర్బిఐ, సిఐడి తదితర విభాగాలకు చెప్పా రు. పజల సొమ్ముకు భద్రత కల్పిం చడంతో పాటు- నకిలీ సంస్థల్లో పెట్టు-బడులు పెట్టి ప్రజలు మోస పోకుండా ఉండేందుకు పెద్దఎత్తున అవగాహన పెంపొందించేం దుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా ఆర్బిఐ చర్యలు చేపట్టాలని సిఎస్‌ ఆదిత్యానాధ్‌దాస్‌ సూచించారు. ఈ సందర్భం గా అగ్రిగోల్డు,అక్షయ గోల్డు, హీరా గ్రూప్‌,కపిల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌,ఆదర్శ్‌ మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ-లు తదితర చిట్‌ఫండ్‌ కంపెనీలపై నమోదైన కేసులపై సమీక్షించారు. అలాగే అన్‌ రిజిస్టర్డ్‌,బోగస్‌ చిట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు మోసా లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్‌ సమీక్షించారు.
సమావేశానికి హాజరైన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా రీజనల్‌ డైరెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ రిజిష్టర్‌ కాని ఫైనాన్స కంపెనీలు,చిట్‌ ఫండ్‌ కంపెనీల మోసా లకు ప్రజలు గురికాకుండా చర్యలు తీసుకోవ డం జరుగుతోందని చెప్పారు.ఇప్పటికే ఆర్బిఐ మోసపూరిత ఫైనాన్స్‌ కంపనీల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలు కూడబెట్టే సొమ్ముకు భద్రత కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
సమావేశంలో ఆర్బిఐ జియం వై.జయకుమార్‌ అజెండా వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.అలాగే గత డిశంబరులో జరిగిన 20వ ఎస్‌ఎల్సిసి సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను వివరించారు.సిఐడి అదనపు డిజి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ వివిధ కంపెనీలు మోసాలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసుల వివరాలను తెలియజేశారు.
సమావేశంలో సహకార మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై .మధుసూదన రెడ్డి, రిజిస్ట్రార్ర్‌ ఆఫ్‌ కోఆపరేటివ్స్‌ బాబు ఏ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ,న్యాయశాఖ కార్యదర్శి సునీత,రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎజియంలు పద్మ పద్మనాభన్‌, ఉదయ్‌ కృష్ణ, మోహన్‌,డిప్యూటీ- లీగల్‌ అడ్వయిజర్‌ ఎస్సి మెహతా,వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement