Sunday, April 28, 2024

దేశంలో 40 వేలు దాటిన కొత్త కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 40,953 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా 23,653 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కు చేరింది. అదే సమయంలో సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,558కు పెరిగింది.

ఇక తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. గత 24 గంటల్లో కొత్త‌గా 364 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement