Thursday, May 9, 2024

బాలురపై లైంగిక దాడి.. గుంటూరులో సైకో దారుణం

గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు బాలుర హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక దాడి చేసి బాలురను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్య చేసింది 19 ఏళ్ల యువకుడు అని పోలీసులు తెలిపారు. తాడేపల్లి మండలంలో మార్చి 14న భార్గవతేజ అనే ఆరేళ్ల బాలుడి అనుమానాస్పద మృతి చెందాడు. మెల్లంపూడి గ్రామానికి చెందిన గోపీ అనే యువకుడు ఈ బాలుడిని హత్య చేసినట్లు విచారణలో తేల్చారు. ఈ మేరకు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు కేసు వివరాలను తెలిపారు.

నిందితుడు గోపీ చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఎదురు తిరిగితే హతమార్చేవాడు. చంపేసిన అనంతరం కూడా లైంగికంగా దాడి చేసేవాడు. భార్గవతేజాను కూడా గోపీ అత్యంత దారుణంగా హత్య చేశాడు. తాడేపల్లి మండలంలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో కలకలం రేగింది. ఓ బాలుడు అదృశ్యమైన రెండో రోజే మృతదేహమై కనిపించడం మరింత సంచలనమైంది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను సవాల్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్నారు.పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఫిబ్రవరి 11న కూడా ఇదే తరహాలో మరో బాలుడిని కిడ్నాప్ లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆ బాలుడి మృతదేహాన్ని సమీపంలోని కృష్ణానదిలో పడేసినట్లు తెలిపాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement