Friday, April 26, 2024

ముంబై లో ల్యాండ్ అయిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే మరోవైపు సీతగా కృతిసనన్ కనిపించనుంది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.

కాగా కొన్ని రోజుల కిందట కొంత షూటింగ్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ కాస్త బ్రేక్ ఇచ్చింది. కొత్త షెడ్యూల్ ను ఏప్రిల్ మొదటి వారం నుండి మొదలుపెట్టబోతుంది. అందుకోసం ప్రభాస్ ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement