Wednesday, May 8, 2024

టీడీపీ నాయ‌కుల‌ను పరామర్శించిన మాజీ మంత్రి ఆనంద‌బాబు

వేమూరు : వేమూరు మండలంలోని వేమూరు, పెరవలి పాలెం గ్రామాల్లో అనారోగ్యానికి గురైన టీడీపీ కార్యకర్తలను మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు బుధవారం గృహాలను సందర్శించి పరామర్శించారు. వేమూరులో టీడీపీ నాయకుడు తుమ్మల శ్రీధర్ ఇటీవల ప్రమాదానికి గురై గాయాలవ్వగా శ్రీధర్ ను ఆనందబాబు పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పెరవలి పాలెం గ్రామంలో విష్ణు మొలకల వీరయ్యను పరామర్శించారు. చావలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అయినంపూడి నాగేశ్వరరావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెరవలి గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు కేసని శివకృష్ణ తాత కేసని రామయ్య ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని సందర్శించి, పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీ దండే సుబ్బారావు, దాది లక్ష్మణరావు, ఇక్కుర్తి నాగయ్య, శేషగిరిరావు, నరసింహారావు, అమెరినేని రవి, తులం రమేష్, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement