Saturday, April 27, 2024

పోలీస్ స్టేషన్ ముందే దంపతులు ఆత్మహత్యాయత్నం

కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ ముందు పురుగుమందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ గొడవలు పడడంతో వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు మారింది. నాలుగేళ్ల క్రితం చందర్లపాడు మండలం పొక్కునూరుకు చెందిన అనిల్ కుమార్ ఒరిస్సాకి చెందిన స్వప్న ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వప్న పురుగు మందు సేవించగా ఆమె చేతిలో ఉన్న పురుగు మందు డబ్బా లాక్కొని అనిల్ కూడా త్రాగాడు. దీంతో  పోలీసులు భార్యాభర్తలను చికిత్స నిమిత్తం నందిగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement