Tuesday, May 7, 2024

భర్త ఎదురుగానే దారుణానికి ఒడిగట్టున మానవ మృగాలు..

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు..ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కాని నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లో భర్త ఎదురుగానే భార్యపై అత్యాచారం చేసిన దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భర్తను చితకబాది.. అతని భార్య పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బార్మెర్‌కు చెందిన దంపతులు బలోత్రాలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో వీరిన అడ్డగించిన నలుగురు దుండగులు..దాడికి పాల్పడ్డారు. అందులో ఒకడు ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు భర్తను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. భర్త పక్కనే కూర్చొనివుండగా ఆ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని ఓ ప్రాంతంలో వదిలివేసి వెళ్లారు.

తేరుకున్న బాధితురాలు.. భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబులాల్, నరేష్‌, కమ్తాయ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ నుంచి తప్పించుకుంటోన్న వైరస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement