తిరుపతి ప్రెస్ క్లబ్ – ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నం లో ఉన్నారని, బిజెపి పాలనలో దేశం అధోగతి పాలైందని వైసిపి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశాన్ని సర్వనాశనం చేసిన మోడీకి, ఆ పార్టీకి తిరుపతిలో ఓటు అడిగే అర్హత లేదన్నారు..బ్యాంకుల విలీకరణతో బ్యాంకింగ్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. రైల్వే, నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవు లాంటి ఎన్నింటినో మోడీ తన అనుయుయలకు అమ్మేశారని దుయ్యబట్టారు. టిడిపి, జనసేన పార్టీలు ప్రజా మద్దతు కోల్పోయాయన్నారు. ఈ ఉప ఎన్నికలో గురుమూర్తి గెలుపుతో మన రాష్ట్ర వైకాపా పాలనకు మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ఓటర్లు అండగా నిలవాలని కోరారు.
మోడీ హయాంలో దేశం అధోగతి పాలైంది – – వైసీపీ ఎమ్మెల్సీ సి. రామ చంద్రయ్య
By sree nivas
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement