Friday, April 26, 2024

శ్రీవారికి రెండు బంగారు పతకాల బహుకరణ

తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి రెండు బంగారు పతకాలు తిరుపతికి చెందిన భక్తుడు మంగళవారం బహుకరించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రూ.7.80 లక్షల విలువ గల ఆభరణాలను ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మికి దాత అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement