Tuesday, April 30, 2024

సంక్షేమ పథకాలు సద్వినియోగం కావడం సంతోషదాయకం.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : సంక్షేమ పథకాలు సద్వినియోగం కావడం సంతోషదాయకమైన ఎమ్మెల్యేభూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికీ, ప్రతి గడపకు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జీవకోనలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు.. ఈ సందర్బంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.

తిరుపతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో 88 వేల మంది వైఎస్సార్ సీపీ కి ఓట్లు వేస్తే, ప్రస్తుతం 2.20 లక్షల మందికి సుమారు 1500 కోట్ల రూపాయల మేరకు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సుమారు 26 వేల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్టు చెప్పారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల మద్దతుతో నిరాటంకంగా కొనసాగు తున్నట్టు వివరించారు. ఈ ప్రభుత్వమే మళ్లీ మళ్లీ అధికారంలో ఉండాలన్న తపన ప్రజల్లో ఉందని భూమన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశించిన లక్ష్యం మేరకు సంక్షేమ పథకాలు సద్వినియోగం కావడం సంతోషకరమని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement