Tuesday, May 21, 2024

కాజీపేట రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద భారీ పోలీస్ బందోబ‌స్తు.. ప‌లు రైళ్ల ర‌ద్దు..

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి నిరసనగా యువకులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఇందులో భాగంగా ఆందోళ‌న కారులు సికింద్రాబాద్ లోని రైలుకు నిప్పంటించి ద‌హ‌నం చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ అధికారులు వెంటనే కాజీపేటకు వ‌చ్చే పలు రైళ్ల‌ను రద్దు చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రైల్వే స్థేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement