Tuesday, May 21, 2024

WGL: అంద‌రూ క‌లిసిక‌ట్టుగా పని చేయండి : ఎమ్మెల్యే తెల్లం పిలుపు

అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని.. మీ అందరికీ అండగా ఉంటానని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. వాజేడు మండలంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడారు.

ఎలాంటి వర్గ విభేదాలు పెట్టుకోకుండా అందరం సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో వాజేడు మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకు రావాలని ఆయన కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వాజేడు మండలానికి తీసుకువచ్చి అందరితో కలిపి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement