Tuesday, May 21, 2024

Agneepath: ఆందోళ‌న‌కారుల‌పై కాల్పుల్లో ఒక‌రు మృతి.. ప‌లువురికి గాయాలు

అగ్నిప‌థ్ వ‌ద్ద‌ని.. ఆర్మీ రిక్రూట్ మెంట్ నిర్వ‌హించాలంటూ చేస్తున్న నిర‌స‌న తీవ్ర విధ్వంసానికి దారితీసింది. నిర‌స‌న కారులు ప‌లు రైళ్ల‌కు నిప్పంటించి.. బైక్ ల‌ను ద‌గ్ధం చేశారు. స్టాళ్లను లూఠీ చేశారు. అయితే నిర‌స‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీయ‌డంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు.

అయితే నిర‌స‌నకారులు పోలీసుల‌పైకి రాళ్లు విస‌ర‌డం.. రైళ్ల‌పైకి రాళ్లు విసురుతూ నిర‌స‌న‌ను విర‌మించ‌క‌పోవ‌డంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. 15రౌండ్లు కాల్పులు జ‌రిపారు. పోలీసులు కాల్పుల్లో ఒక మృతిచెంద‌గా.. ప‌లువురికి గాయాల‌య్యాయి.. గాయాల‌పాలైన వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement