Friday, May 10, 2024

కేంద్రం వైఖ‌రి మార్చుకోవాలి.. కాంగ్రెస్ నాయ‌కుల నిర‌స‌న‌

వరంగల్ : క‌క్ష‌పూర్వ‌కంగానే సోనియా, రాహుల్ గాంధీని కేంద్రం టార్గెట్ చేసింద‌ని, వెంట‌నే కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు నిర‌స‌న చేప‌ట్టారు. శుక్ర‌వారం సోనియా, రాహుల్ గాంధీల పై ఈడీ చర్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వరంగల్ లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement