Saturday, April 27, 2024

కుప్పంలో చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు దగ్ధం

కుప్పం, ఏప్రిల్ 24(ప్రభ న్యూస్): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖలను నిరసిస్తూ కుప్పం వైకాపా పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సోమవారం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి కుప్పం కొత్తపేట నుంచి కుప్పం ఆర్టిసి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు లోకేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. నారా లోకేష్ దళితులను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నారా లోకేష్ దళితులను హేళన చేయడం సరికాదన్నారు. వైసీపీ పాలనలో దళితులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్ సీపీనే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ మునస్వామి, కౌన్సిలర్లు జగన్, నాగరాజు, గణపతి, విజయకుమార్, రాజ్ కుమార్, సయ్యద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement