Friday, May 10, 2024

ఇంటికే ప‌రిమిత‌మ‌య్యా….

పూజా హెగ్డే వరుస విజయాలు అందుకుంటున్న నాయిక. బాలీవుడ్‌ కంటే తెలుగులోనే ఎక్కువ ఫాలోయింగ్‌. సెంటిమెంట్‌గా కూడా ఆమె నటిస్తే సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతుంటారు. అయితే ఈ విజయం ఆమెకు రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ముకుంద సినిమాతో అరంగేట్రం చేశాక కమర్షియల్‌ సక్సెస్‌ రావడానికి కొంత టైమ్‌ పట్టింది. పూజా హెగ్డే వరసగా ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అలా వైకుంఠపురం చిత్రాల్లో నటించింది. వీటిలో వైంకుఠపురం ఆల్‌టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తను కూడా అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితిని ఎదుర్కొన్నట్టు పూజా చెప్పింది. విజయాలు లేనప్పుడే ఇలాంటివి ఎదురవుతాయని, ఏడాది పాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది తెలిపింది. హీరో కాంబినేషన్‌ సినిమాలు చేసినప్పటికీ, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పాత్రలు ధరించాలని ఉంది అని తన మనసులోని మాటను తెలిపింది. పూజా హెగ్డే తాజాగా మహేష్‌ బాబు కొత్త సినిమాలో నటిస్తోంది. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement