Monday, April 29, 2024

రోడ్డుపై గుర్ర‌పు బండ్ల‌తో పందాలు.. పదిమంది అరెస్ట్

ర‌ద్దీగా ఉండే రోడ్డుపై గుర్ర‌పు బండ్ల‌తో పందెం పోటీలు నిర్వ‌హించారు. ఆ బండ్లకు వెనుకా ముందు టూ వీలర్ లపై కేకలు పెడుతూ యువ‌కులు ప్రయాణించారు. ఆ బండ్లను మరింత వేగంగా తోలాలని టోంగావాలాలను హుషారు పెట్టారు. ఇదంతా వీడియో కూడా తీశారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, ఇతర సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పది మందిని అరెస్టు కూడా చేశారు. జంతువులను హింసిచే చట్టాల కిందా వారిపై అభియోగాలు మోపారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని షాపింగ్ ఎక్కువగా జరిగే కమలా మార్కెట్ దగ్గర చోటుచేసుకుంది. అరెస్టు చేసిన వారు రోడ్లపై న్యూసెన్స్ చేశారని, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి వారిని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా పోలీసులు నాలుగు గుర్రాలను, మూడు టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FANI%2Fstatus%2F1650188527785906178&widget=Tweet

Advertisement

తాజా వార్తలు

Advertisement