Thursday, May 9, 2024

కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.. బత్తయ్య నాయుడు

శ్రీకాళహస్తి – రాష్ట్ర భవిష్యత్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర పిసిసి కార్యదర్శి డాక్టర్ సముద్రాల బత్తయ్య నాయుడు తెలిపారు.సోమవారం శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేసిన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు శైలజ నాధ్ ను పార్టీ కార్యాలయంలో దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీలు కులాలకు కొమ్ముకాసే విధంగా చేస్తున్నారని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నట్లయితే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ పాలన చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా పాలన చేయడం తధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement