Saturday, April 27, 2024

వైభవంగా వెంకన్న గరుడోత్సవం. ..

రామసముద్రం – వైభవంగా ఘట్లు వేంకటేశ్వర స్వామి గరుడోత్సవం వైభవంగా జరిగింది. మండలంలోని చెంబకూరు పంచాయతీ కేంద్రంలో జరుగుతున్న ఘట్టు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారు గరుడవాహణం పై ఊరేగారు. అంతకుముందు స్వామి వారి కళ్యాణోత్సవం కనుల విందిగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల నుంచి భక్తులు వేల సంఖ్యలో పొల్గొన్నారు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు దిగువపల్లికి చెందిన శేఖర భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత వరుడు వేంకటేశ్వర స్వామి,వదువు పద్మావతి అమ్మవారి పేరన భక్తులు సదివింపులు చేశారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారిని చెంబకూరు భక్తాదులు ఇంటింటా పూజలు చేసి మెక్కలు తీర్చుకున్నారు. తర్వాత సోమవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవం కు కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement