Saturday, April 27, 2024

వివేకా హ‌త్య కేసులో మ‌రో అయిదుగురికి నోటీసులు

కడప, ప్రభ న్యూస్‌బ్యూరో: మాజీ మంత్రి వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ఐదుగురు పులివెందుల వైసిపికి చెందిన వారికి సిబిఐ నోటీ-సులు జారీ చేసింది. ఇటీ-వల ఈ కేసులో దూకుడు పెంచిన సిబిఐ విచారణ వేగవంతం చేసింది. తాజాగా పులివెందుల చెందిన ఐదుగురికి నోటిఫికేషన్‌ జారీ చేయడం తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు. హత్య జరిగిన రోజున వీరు వివేకాహత్యకేసు విచారణను ఎదుర్కొంటు-న్న అవినాష్‌ రెడ్డిని కలిసినట్లు- సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌(పిసిసి)కి చెందిన ఉద్యోగి సుధాకర్‌ను కడప సెంట్రల్‌ జైలులో గురువారం విచారించారు. సుమారు రెండు గంటల పాటు- సుధాకర్‌ను సిబిఐ విచారించినట్లు- తెలుస్తోంది.ఈ పరిణామాలతో పాటు- వైయస్‌ భారతి వ్యక్తిగత కార్యదర్శి నవీన్‌కు మరోసారి సిబిఐ నోటీ-సులు నోటీ-సులు ఇవ్వనున్నట్లు- తెలుస్తోంది. గత నెలలో నవీన్‌ను కడప సెంట్రల్‌ జైల్లో విచారించడం జరిగింది. నవీన్‌ తరుపున్యాయవాది సుదర్శన్‌ రెడ్డి సెంట్రల్‌ జైల్లో సిబిఐ అధికారులను కలిసినట్లు- సమాచారం నవీన్‌కు సంబంధించిన కుటు-ంబ వివరాలను లాయర్‌తో కలిసి సిబిఐకి నవీన్‌ సోదరుడు ఇచ్చినట్లు- తెలుస్తోంది. నవీన్‌కు మరోసారి నోటీ-సు ఇవ్వనున్నట్లు- కూడా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement