Monday, April 29, 2024

పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న BjP ప్రభ్యత్వం… మంత్రి తలసాని

బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళనలో మంత్రి పాల్గొన్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ వెంటనే గద్దె దిగాలన్నారు. అంబానీ… ఆదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని BJP నేతలు కలలు కంటున్నారన్నారు.

2024 లో కేంద్రంలో BJP ప్రభ్యత్వం పతనం ఖాయమన్నారు. కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మ్ హాస్పిటల్ లో అనుమతించలేదన్నారు. ముఖ్యమంత్రి KCR చొరవతో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేశారన్నారు. కంటోన్మెంట్ లో గతంలో 15 రోజులకు ఒకసారి త్రాగునీటి సరఫరా జరిగేదని, నేడు ప్రతినిత్యం సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే TRS పార్టీ BRS పార్టీ గా మార్పు చెందిందని మంత్రి తలసాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement