Saturday, April 27, 2024

NLR: కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

సంగం, సెప్టెంబర్ 20, (ప్రభ న్యూస్) : మండలంలోని పెరమణా సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు సంఘం ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంఘం నుండి ఆత్మకూరుకు వైపు వెళుతున్న మోటారు బైకును, ఆత్మకూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళుతున్న కారు అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. మృతిచెందిన వ్యక్తి అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన నాగేంద్రగా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయాలైన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement