Thursday, May 2, 2024

ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్ల ఘటన.. ఐదుగురు అరెస్ట్‌

ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు వచ్చి వెళ్తున్న సందర్భంగా నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిన్న రాత్రి ఐదుగురిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అర్ధరాత్రి 2 గంటల వరకు హైడ్రామా కొనసాగగా.. ఎట్టకేలకు వారికి బెయిల్ మంజూరైంది. గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, సావిత్రి, కిషోర్, రవికాంత్, రాజశేఖర్ ఉన్నారు.

కాగా, ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం ఎలాంటి భద్రతా లోపం లేదంటున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లు ఎగురవేసినట్లు తెలిసిందని కృష్ణా జిల్లా ఎస్‌పీ పేర్కొంటున్నారు. అయితే  దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని డీఎస్‌పీ విజయపాల్‌ వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement