Saturday, May 25, 2024

అన్న క్యాంటీన్ లో రూ.2కే చికెన్ బిర్యానీ.. అందుబాటులోకి తెచ్చిన హీరో బాలకృష్ణ

ఓ పక్క సినిమాలు..టీవీ షో..మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. కాగా బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్న క్యాంటీన్ ద్వారా అతి తక్కువ ధరకే సొంత ఖర్చులతో హిందూపురం ప్రజలకు భోజన సౌకర్యాన్ని బాలయ్య అందుబాటులోకి తెచ్చారు. అలాగే మొబైల్ వైద్య శాలను కూడా హిందూపురం ప్రజలకు బాలకృష్ణ అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీనులు పెట్టి 200 రోజులు పూర్తి కావడం మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి కావడంతో రూ.2కే చికెన్ బిర్యానీని అందుబాటులోకి తెచ్చారు బాలకృష్ణ.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2కే కిలోబియ్యం పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ఆ కార్యక్రమాన్ని మనసులో పెట్టుకుని అన్న క్యాంటీన్ ద్వారా రూ.2కే నిత్యం భోజనం అందిస్తున్నారు. ఇప్పుడు రూ.2కే చికెన్ బిర్యానీని అందుబాటులోకి తెచ్చారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 200 రోజులు పూర్తి కావడంతో రూ.2కే చికెన్ బిర్యానీ.. గుడ్డు.. స్వీటును 500 మందికి అందించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. రూ.2 కే చికెన్ బిర్యానీ స్వీటు గుడ్డు అందిస్తుండటంతో దీని కోసం ప్రజలు బారులు తీరారు. మాకు మాకంటూ ఎగబడ్డారు. తిన్నవారంతా జై బాలయ్య అంటూ ఆనందంతో నినాదాలు సైతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement