Friday, April 26, 2024

Breaking: ఏనుగుల బీభ‌త్సం.. ఒక‌రు మృతి

ఏనుగులు బీభ‌త్సం సృష్టించ‌డంతో ఒక‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా తాలాడ‌లో చోటుచేసుకుంది. గోపిశెట్టి చిన్నారావు, పార్వ‌తి, జ‌య‌ల‌క్ష్మీల‌పై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన చిన్నారావు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలో కూడా ఏనుగులు తమ పొలాల్లోకి వచ్చి తమ పంటలను నాశనం చేశాయన్నారు. ఏనుగుల దాడితో గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement