Friday, April 26, 2024

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఎపి గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు..

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ దంపతులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. విజ‌య‌వాడ‌ నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో గవర్నర్‌ దంపతులు కోవాగ్జిన్‌​ టీకా వేయించుకున్నారు. అనంతరం బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ మాట్లాడుతూ, కోవిడ్‌-19ను ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. రాత్రింబవళ్లు టీకా కనుగొనేందుకు కృషి చేసిన శాస్తవేత్తలను ఆయన ప్రశంసించారు. అర్హులైన వారంతా టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని గవర్నర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement