Wednesday, May 8, 2024

వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

కరోనా నివారణకు ఏపీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. కొవిడ్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది హాజరు కావాలని తెలిపారు. వివాహాలకు వచ్చేవారిని 150 మందికే పరిమితం చేయాలని ఆదేశించారు. మరికొన్ని నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇకపై ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు గడువులోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ లో 45 ఏళ్లు దాటినవారికి, గర్భిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరుస్తున్నందున, వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: టీమిండియా బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్..

వ్యాక్సిన్ తీసుకున్న వారికే మాల్స్ లో ఎంట్రీ!

Advertisement

తాజా వార్తలు

Advertisement