Saturday, May 4, 2024

Hyderabad : పీవీ రమేష్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. ఓ కేసు విషయంలో ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.

పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అత్యంత కీలకమైన పదవుల్లో పని చేశారు . తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు ఇచ్చారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement