Sunday, April 28, 2024

Annamaiah Victims – ఆ బాధితుల‌కు న్యాయం కోసం నెల వెయిట్ చేస్తాం… ప‌వ‌న్ కల్యాణ్

అమరావతి: అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు న్యాయం కోసం మ‌రో నెల వెయిట్ చేస్తామ‌ని జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు..ఈ డ్యామ్ బాధిత కుటుంబాల‌కు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీపై జనసేన అధినేత త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.. ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు మోకాలడ్డేలా, కంటితుడుపులా ఉండబోవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ఎంతమేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందేనని అప్పటి వరకు జనసేన నిరీక్షిస్తుందని పవన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement