Wednesday, May 1, 2024

బీచ్ లో ప్లాస్టిక్ వ్య‌ర్థాలు తొల‌గించిన.. క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి

విజయనగరం : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జ‌రిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ ఆధ్వర్యంలో బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే కార్యక్రమం చేప‌ట్టారు.ఈ కార్య‌క్ర‌మంలో మత్స్యకారులు, పలు పరిశ్రమల ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు పాల్గొన్నారు.
బీచ్ లో వాక్ థాన్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను స్వయంగా తొలగించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.. కాలుష్యం, వ్యర్థాల నుంచి సముద్రాలను రక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్ నాగలక్ష్మి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement