Sunday, April 28, 2024

మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలతో పాటు పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. పశ్చిమ బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్ గఢ్ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement