Saturday, April 27, 2024

శ్రీధర్ రెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవం.. మంత్రి కాకాణి

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ అవాస్తవమని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీధర్ రెడ్డి చెప్పింది అబద్దమని రామశివారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. అది ఫోన్ కాల్ రికార్డు మాత్రమేనని రామశివారెడ్డి చెప్పారన్నారు. నమ్మి ఆడియో క్లిప్ పంపితే ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్ రెడ్డి రచ్చ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సరిపోదు.. ఆధారాలు కూడా సమర్పించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement