Friday, April 26, 2024

ఖిన్వ్ స‌ర్ కోట‌లో.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ కుమారై వివాహం..

నేడు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ కుమారై షానెల్..అర్జున్ భ‌ల్లాల వివాహం జ‌ర‌గ‌నుంది.ఈ జంట నిశ్చితార్థం 2021,డిసెంబర్ నెలలో జరిగింది. స్మృతి ఇరానీ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో వారికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కూతురు షనైల్ ఇరానీ.అర్జున్ భల్లాల నిశ్చితార్థం గురించి తెలియజేశారు. జోధ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని నాగౌర్ జిల్లాలోని ఖిన్వ్‌సర్ కోటలో ఈ వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుకలో భాగంగా ఇప్పటికే హల్దీ,మెహందీ వేడుకలు ప్రారంభమయ్యాయి.ఫిబ్రవరి 9న షనైల్ ఇరానీ, అర్జున్ భల్లాలు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు.ఇదిలాఉంటే.. స్మృతి ఇరానీకి అల్లుడు కాబోతున్న ఈ అర్జున్ భల్లా ఎవరంటే.. ఇత‌నో ఎన్నారై. MBA డిగ్రీ హోల్డర్, తన కుటుంబంతో కెనడాలో నివసిస్తున్నాడు. అర్జున్ భల్లాకు తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు. అర్జున్ కెనడాలోని సెయింట్ రాబర్ట్స్ కాథలిక్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు. లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో LLB పూర్తి చేశారు. స్మృతి ఇరానీ కూతురు షనీల్ పెళ్లి కోసం ఖిన్వ్సర్ ఫోర్ట్‌ను మూడు రోజుల పాటు బుక్ చేసుకుంది.కాగా బుధవారమే వారు జోధ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement