Friday, May 3, 2024

క్వారీలో ఇసుక లోడింగ్ చేస్తుండగా యువకుడు మృతి

తాడేపల్లి, మే11 (ప్రభ న్యూస్) : గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి గుండిమెడ ఇసుక రీచ్ లో అనుమానాస్ప‌దస్థితిలో యువకుడు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు జేసీబీతో ఇసుకనులోడింగ్ చేసే క్రమంలో ట్రాక్టర్ లో యువకుడు ఇసుకను సరిచేస్తున్నాడని చెప్పారు. ఈ క్రమంలో గమనించని జేసీబీ డ్రైవర్ ఇసుకను లోడింగ్ చేశాడని, దీంతో ఊపిరాడక ప్రత్తిపాడుకు చెందిన బండారు వర్మ (21) అక్కడిక్కడే మృతిచెందాడని తెలిపారు. మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. అయితే మృతుడు ప్రమాదవశాత్తూ మరణించాడా. లేక మరేదైనా జరిగిందా అనేది పోలీసుల విచారణ అనంతరం తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement