Monday, May 13, 2024

Accident: బోల్తా పడిన ట్రాక్టర్.. 10 మంది పరిస్థితి విషమం

విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొండపల్లి మండలం చామలవలస గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులందరూ మెంటాడమండలం, చింతాడవలస గ్రామానికి  చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement