Sunday, May 19, 2024

Breaking: ఏపీలో 15 మంది ఐపీఎస్ ల‌ బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఐపీఎస్ ల బ‌దిలీల‌ జీవోను విడుదల చేశారు. ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్‌డీ రామకృష్ణ, కేవీ మోహన్‌ రావు, ఎస్‌ హరికృష్ణ, గోపినాథ్‌ జట్టి, కోయ ప్రవీణ్‌, విశాల్‌ గుణ్ణి, రవీంద్ర బాబు, అజిత వెజెండ్ల, జీ కృష్ణకాంత్‌, పీ జగదీశ్‌, తుహిన్‌ సిన్హా, బిందు మాధవ్‌ గరికపాటి, పీవీ రవికుమార్‌ బదిలీ జాబితాలో ఉన్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్‌ తాజా జీవోలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement