Tuesday, April 30, 2024

వేరుశెనగ కొనుగోలు పై శిక్షణ..

లేపాక్షి మండలంలోని వ్యవసాయ కార్యాలయంలో హిందూపురం ఏడీఏ రవి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా వేరుశెనగ కొనుగోళ్లు పై విఏఏ,విఎస్ఏ,విఎచ్ఏ, పల్లెజీవనం సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేరుశెనగ 1క్వింటాకు 6400రూపాయులుగా చొప్పున రబీ బోరు బావుల క్రింద వేసిన ప్రతి చిన్న రైతు వేరుశెనగ కాయులను కొంటామని తెలిపారు. అలాగే క్రాఫ్ ఇన్సూరెన్స్ ఖరీఫ్ 2020లో పంట వేసిన ప్రతి రైతు వారి రైతుభరోసా కేంద్రంలో వెళ్లి బయోమెట్రిక్ చేయించుకోవాలని తెలిపారు. అలాగే ఖరీఫ్ 2021 వేయబోవు పంటల మీద ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేంద్రనాయిక్, ఏఈఓ పుష్పలత,సచివాలయ సిబ్బంది పల్లెజీవనం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement