Thursday, May 2, 2024

తెలంగాణలో తగ్గని కరోనా వేవ్: మరో 463 మందికి కరోనా..

తెలంగాణలో గత 24 గంటల్లో 42,461 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా కొత్త‌గా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1694కి చేరింది. అదే సమయంలో 364 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,07,205కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 364 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,678 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,723 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 145 మందికి క‌రోనా సోకింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,00,95,487కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement