Tuesday, April 23, 2024

మాస్క్ ధరించకుంటే జరిమానా

కందుకూరు : కందుకూరు పట్టణంలోని రూరల్‌ పోలీసు స్టేషన్‌ జంక్షన్‌లో మాస్కులు లేని వారికి జరిమానాలు విధించారు. సుమారు ఒకటిన్నర గంటల్లో 80 మందికి పైగా జరిమానాలు విధించినట్లు డిఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రెండో దశ మొదలు కావడంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన అన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అంకమరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement