తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ పుట్టినరోజు పేరుతో టీఆర్ఎస్ నేతల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ సానుభూతి పరులపై పోలీసుల సమక్షంలోనే స్వయంగా ఎమ్మెల్యే దాడి చేయడం అటవిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోను కూడ పంచుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement