Saturday, May 4, 2024

నవంబర్ 11న విశాఖలో పర్యటించనున్న- ప్రధాని మోడీ

ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ మేరకు నవంబరు 11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు. ప్రధాని రాక నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ ఇతర అధికారులు నిన్న సమీక్షించారు. డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న నౌకా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement