Tuesday, April 23, 2024

సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు


ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకరు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్‌ చిలకలగూడలో చోటు చేసుకుంది. గ్యాస్‌ లీకవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసమయింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి, క్షతగాత్రులను గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement