Friday, May 3, 2024

Covid Update : భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా వెయ్యిలోపే..!

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. గతంలో రెండు వేల పాజిటివ్‌ కేసుల వరకు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య కాస్త వెయ్యికి చేరింది. తాజాగా దేశంలో కొత్తగా 830 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,45,768కి చేరింది. ఇందులో 4,40,95,180 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,981 మంది వైరస్‌కు బలయ్యారు. మరో 21,607 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 1771 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement