Thursday, May 2, 2024

ప్ర‌ధాని మోడీతో – ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ భేటీ

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ ..ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్ర‌త్యేకంగా భేటీ అవ్వ‌డం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. దాదాపుగా 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని ఎన్సీపీ, శివసేన నేతలపై ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జరుపుతున్న దాడుల నేపథ్యంలో ప్రధానితో .. పవార్ కల‌వ‌డం విశేషం. వీరి సమావేశంపై ఇరు పార్టీలు ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ముఖ్య నేత.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ, ఈ సమావేశంపై తన వద్ద సమాచారం ఏదీ లేదని, అటువంటప్పుడు తాను దీనిపై స్పందించలేనని వ్యాఖ్యానించారు. అయితే, దేశ ప్రధానిని, ఓ జాతీయ పార్టీ నాయకుడు కలవడంలో తప్పులేదని, వారిద్దరూ పెద్ద నాయకులనీ, వారు దేని గురించి చర్చించుకున్నారో తనకు తెలియదని అజిత్ పవార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement